రైతుల హక్కుల కోసం రైతులు ప్రశ్నించకపోతే నష్టపోతాం.|| If the farmers do not ask for the rights of the farmers, we will lose.
If the farmers do not ask for the rights of the farmers, we will lose.
రైతుల హక్కుల కోసం రైతులు ప్రశ్నించకపోతే నష్టపోతాం.
ఏవి.రమణ, రైతు సేవ సమితి
సహాయన్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న రైతు(farmer) సోదరులారా రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ హక్కుల కోసం, జీతభత్యాల కోసం ఏ విధంగా సంఘాలు ఏర్పరచుకొని ఉద్యమాలు నిర్వహించి తమ హక్కులను సాధించుకుంటున్నారో ఆలోచించండి.
రాష్ట్రంలోని
రైతులు(farmers) కూడా పాలక, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచార
సమయంలో రైతులకు ఇచ్చిన హామీల అమలు కోసం రైతులు(farmers) ఎదుర్కొంటున్న
సాగునీటి ప్రాజెక్టుల కోసం ఇతర సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో రైతులందరూ(farmers) కూడా
సంఘటితమై ప్రశ్నించకపోతే నష్టపోతారని రైతు(farmer) సేవా
సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి.రమణ అన్నారు.
ఈరోజు జిల్లాలోని ఎర్రగుంట్ల పట్టణంలో రైతు
సేవా సమితి జమ్మలమడుగు నియోజకవర్గ కన్వీనర్ ఎర్ర వెంకటస్వామి, (farmers) రైతులు హేమరాజు, సురేష్ జిల్లా సమితి సభ్యుడు మూలే
రామాంజనేయరెడ్డి తదితరులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ రైతులకు
కేంద్ర ప్రభుత్వం తను రైతులకుఇస్తున్న 6000 వేలరూపాయలు మూడు విడతల్లో ఇప్పటికే ఒక విడత 2000 రూపాయలు, అమలు చేశారని, రేపు మాపు రెండో విడత కూడా 2000 రూపాయలు అమలవుతుందని ప్రచారం
జరుగుతుంటే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తను ఇస్తామన్న 20,000 సహాయం పై ఇప్పటివరకు స్పందించకపోవడం
చాలా దురదృష్టకరమని ఈ విషయం పైన పాలక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా
స్పందించకపోవడం దారుణమని అన్నారు.
రైతులకు(farmers) పెట్టుబడులకు అందజేస్తామన్న సాయం రైతులు
పొలాల్లో పంటలు పండించడం మొదలు పెట్టి ఒక సీజన్ ఖరీఫ్ అయిపోయి రబీ కాలం వస్తున్న
ఇప్పటివరకు రాష్ట్రంలో రైతుల(farmers) సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమని
వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సహాయం అందించాలని రమణ అన్నారు.
అలాగే జిల్లాలో, రాయలసీమలో శంకుస్థాపనలకు పరిమితమైన, పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసే విధంగా రైతులు స్పందించాలని లేకపోతే రాష్ట్రాన్ని పాలించిన పాలకులు ముఖ్యమంత్రులు అంతా కూడా రాయలసీమ వాసులైన ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో సాగునీటి పారుదల ఇతర ప్రాంతాలలో 44 శాతం ఉంటే, రాయలసీమ జిల్లాలలో 9 తొమ్మిది శాతం మాత్రమేనని రైతుకు నీరు అందేది కేవలం 3 మూడు శాతం మాత్రమేనని కావున రైతులు(farmers) ఒకసారి ఆలోచించాలని అన్నారు.
అంగట్లో అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అనే విధంగా
ఉంది అని రాష్ట్రాన్ని పాలించేది రాయలసీమ జిల్లాల వాసులైన అభివృద్ధిలో మాత్రం
పూర్తి వెనుకబడి ఉందని కావున రాజకీయాలకతీతంగా రైతులందరూ(farmers) ఇప్పటికైనా స్పందించకపోతే నిధులు అన్నీ కూడా మరో
అమరావతి, పోలవరానికి ఖర్చు ఐపోతే అభివృద్ధి లెక
నష్టపోకతప్పదని కావున ఇప్పటికైనా రైతులు(farmers) ఎక్కడికక్కడ తమ సమస్యల పరిష్కారం కోసం
ప్రశ్నించాలని రమణ కోరారు.
కామెంట్లు